Bandi Sanjay Clarity: అందుకే నాపై చెప్పులు మోసానంటూ ప్రచారం

ABN , First Publish Date - 2022-08-22T19:32:42+05:30 IST

కేంద్రమంత్రి అమిత్‌ షా చెప్పులు మోసిన వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు.

Bandi Sanjay Clarity: అందుకే నాపై చెప్పులు మోసానంటూ ప్రచారం

జనగామ: కేంద్రమంత్రి అమిత్‌ షా (Amith shah) చెప్పులు మోసారంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) స్పందించారు. సోమవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) మద్యం ఇష్యూను డైవర్ట్ చేసేందుకే అమిత్ షా (Union minister) బూట్లు మోసానని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు సభా విజయం పక్కదారి పట్టించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘‘అమిత్ షా నా గురువు. అమిత్ షా అంటే నాకు ఎంతో గౌరవం. అమిత్ షా ను తాకడమే అదృష్టంగా భావిస్తారు. దానికి ఆత్మగౌరవానికి సంబంధం లేదు. నేను ఇటలీ వాళ్ల కాళ్లు మొక్కలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కాళ్లు మొక్కినప్పుడు ఆత్మగౌరవం ఎక్కడబోయింది’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-22T19:32:42+05:30 IST