మీలా మేం మాట్లాడితే తట్టుకోలేరు: Bandi sanjay
ABN , First Publish Date - 2021-11-30T19:50:04+05:30 IST
కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ భాష మార్చుకోవాలన్నారు. ‘‘మీలా మేం మాట్లాడితే తట్టుకోలేరు’’ అని తెలిపారు. ఢిల్లీ వెళ్లొచ్చాక కేసీఆర్కు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు. మెడపై కత్తి పెడితే ఫాం హౌస్ రాసిస్తారా అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందని అని నిలదీశారు. రా రైస్ పక్కాగా కొంటామని కిషన్రెడ్డి చెప్పారని తెలిపారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఎలా బంద్ చేస్తారో చూస్తామన్నారు. వానాకాలం పంటను ఎలా కొంటున్నారో..అలానే యాసంగి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.