జోయల్ నీ పేరు గుర్తుపెట్టుకుంటా: ఎంపీ అరవింద్

ABN , First Publish Date - 2020-10-27T14:46:14+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ నేత అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జోయల్ నీ పేరు గుర్తుపెట్టుకుంటా: ఎంపీ అరవింద్

కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ నేత,  ఎంపీ అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీపీ జోయల్  డేవిస్ పోలీసా.. గూండానా అని ధ్వజమెత్తారు. జోయల్‌‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని అరవింద్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ‘‘జోయల్ నా పేరు అరవింద్.. నీ పేరును నేను గుర్తు పెట్టుకుంటా’’ అంటూ అరవింద్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.


దుబ్బాక బీజేపీ అభ్యర్థి  రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడకు బయలుదేరిన సంజయ్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించారు. దీంతో కరీంనగర్‌లో తన కార్యాలయంలో గత రాత్రి  ఒంటరిగానే సంజయ్ దీక్షకు దిగారు. ఎంపీ కార్యాలయానికి బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. రాత్రి నుంచి కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-27T14:46:14+05:30 IST