మాజీ సీఎం నాలుక కోస్తే రూ.11లక్షల రివార్డ్...బీజేపీ నేత సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2021-12-21T15:07:57+05:30 IST

బీహార్ భారతీయ జనతా పార్టీ నాయకుడు గజేంద్ర ఝా సంచలన ప్రకటన చేశారు....

మాజీ సీఎం నాలుక కోస్తే రూ.11లక్షల రివార్డ్...బీజేపీ నేత సంచలన ప్రకటన

మధుబని(బీహార్): బీహార్ భారతీయ జనతా పార్టీ నాయకుడు గజేంద్ర ఝా సంచలన ప్రకటన చేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ నాలుకను కోసిన వారికి రూ.11లక్షల రివార్డు ఇస్తామని బీజేపీ నేత గజేంద్ర ఝా ప్రకటించారు. పూజారులపై కించపర్చే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ నాలుకను కోయాలని భారతీయ జనతా పార్టీ నాయకుడు గజేంద్ర ఝా కోరారు.సనాతన్ ధర్మానికి వ్యతిరేకంగా మాంఝీ ఉద్ధేశపూర్వకంగా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారని ఝా ఆరోపించారు. ‘‘హిందూ సనాతన ధర్మాన్ని నమ్మకపోతే మాంఝీ మతం మారాలి. సంఘంపై కించపరిచే వ్యాఖ్య చేసినందుకు బ్రాహ్మణుడి కొడుకు ఎవరైనా మాంఝీ నాలుకను నరికితే వారికి రూ.11 లక్షల నగదు బహుమతిని అందజేస్తాం’’ అని ఝా తెలిపారు.



మాంఝీకి చెందిన హిందుస్థాన్ అవామీ మోర్చా బీహార్‌లో అధికారంలో ఉన్నపుడు సమయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ పార్టీ.మాంఝీపై దాడి చేసే ధైర్యం ఎవరికీ లేదని హిందుస్థాన్ అవామీ మోర్చా పార్టీ నాయకుడు దానిష్ రిజ్వాన్ అన్నారు. ‘‘బీజేపీ నాయకత్వం తన నాయకులను అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే ఫలితాలు చెడుగా వస్తాయి’’ అని మాంఝీ పార్టీ నేత దానిష్ అన్నారు. మాంఝీ తన వ్యాఖ్యలపై ఇప్పటికే విచారం వ్యక్తం చేసిన తర్వాత, ఈ సమస్యను లేవనెత్తడం సరికాదని హిందుస్థాన్ అవామీ మోర్చా నేత దానిష్ వివరించారు.

Updated Date - 2021-12-21T15:07:57+05:30 IST