‘అన్ని చోట్ల పోటీకి సిద్ధం కావాలి’

ABN , First Publish Date - 2021-01-27T06:22:10+05:30 IST

పిఠాపురం, జనవరి 26: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీకి సిద్ధం కావాలని బీజేపీ కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు చిలకూరి రామ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పా

‘అన్ని చోట్ల పోటీకి సిద్ధం కావాలి’

పిఠాపురం, జనవరి 26: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీకి సిద్ధం కావాలని బీజేపీ కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు చిలకూరి రామ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ మద్దతుదారులు అన్ని స్థానాల్లో పోటీపడేలా నాయకులు కృషి చేయాలన్నారు. ప్రధాని మోదీ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో బీజేపీ నాయకులు కేతినీడి విజయరామయ్య, దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, ప సుపులేటి సత్యనారాయణ, పిల్లా ముత్యాలరావు, జీలకర్ర సత్యనారాయణ, చిట్టా మధు, తేటకాయల కృష్ణ, తోట ఏడుకొండలు, గండి కొండలరావు పాల్గొన్నారు. 


బీజేపీ, జనసేన పోటీ

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా పోటీ చేయనున్నట్టు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిలిదేవి సత్తిరాజు తెలిపారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో మండలా ధ్యక్షుడు పత్రి రమణ అధ్యక్షతన బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సత్తిరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని బీజేపీ, జనసేన కలిసికట్టుగా కృషిచేయాలని కోరారు. బీజేపీ నాయకులు గున్నాబత్తుల రాజబాబు, మదినె బాబ్జి, ఊటా సోమరాజు, కప్పన కోటేశ్వరరావు, ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకులు సుబ్రహ్మణ్యం, రాశంశెట్టి రాజా పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T06:22:10+05:30 IST