బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు హితేంద్ర మృతి
ABN , First Publish Date - 2021-04-17T05:53:38+05:30 IST
బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ హితేంద్ర (నాని) (53)గుండె పోటుతో శుక్రవారం కన్నుముశారు.
గుడివాడ టౌన్ : బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ హితేంద్ర (నాని) (53)గుండె పోటుతో శుక్రవారం కన్నుముశారు. బాపులపాడు మండలం సిరివాడ స్వగ్రామం అయినా బాల్యం నుంచి గుడివాడతోనే అను బంధం ఉంది. 2009 జనరల్ ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన నాని విదేశాల నుంచి తన కుమార్తె, కుమారుడు విచ్చేడంతో ఉగాదికి తన మేనమామ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి వెళ్లారు. అక్కడ గుండెపోటు రావటంతో మృతి చెందారు. హితేంద్ర భౌతిక కాయాన్ని విజయవాడలోని స్వగృహానికి తరలించారు. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ, గుత్తికొండ రాజబాబు నిమ్మగడ్డ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిం చారు. తూర్పుకృష్ణా అధ్యక్షుడు మాట్టా ప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి సూరే లక్ష్మీనారాయణ (గాంధీ), శలంకాయల లీలాకుమారి, శలంకాయల మురళీకృష్ణ, ఆలమూరి మురళీకృష్ణ, అంగడాల సతీష్, పి.వీరభద్రరావు, శ్రీనివాస్, ఆంజనేయులు సంతాపం తెలిపారు.