సినీ నటి ఖుష్బూ వెనకంజ

ABN , First Publish Date - 2021-05-02T20:36:06+05:30 IST

తమిళనాడులోని 232 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్‌ను బట్టి..

సినీ నటి ఖుష్బూ వెనకంజ

చెన్నై: తమిళనాడులోని 232 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్‌ను బట్టి తమిళనాడులో డీకేంకే 141 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతూ, మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. డీఎంకే చీఫ్ స్టాలిన్ , ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ముందంజలో ఉండగా, థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటి ఖుష్బూ సుందర్ వెనుకబడ్డారు. తన సమీప డీఎంకే అభ్యర్థి ఎళిలన్ ఎన్ కంటే 5,000 ఓట్ల వెనుకబడ్డారు. తొలుత కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన ఖుష్బూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. అన్నాడీఎంకే పొత్తుతో బీజేపీ పోటీ చేస్తున్నందున చివరివరకూ ఆమెకు టిక్కెట్ కేటాయించే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు థౌంజడ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఆమెకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి పళనిస్వామి సైతం ఖుష్బూ తరఫున ఎన్నికల ప్రచారం సాగించారు.

Updated Date - 2021-05-02T20:36:06+05:30 IST