టీటీడీ ఆస్తుల్ని విక్రయించమని ప్రకటించే వరకు పోరాటం: కన్నా
ABN , First Publish Date - 2020-05-26T22:08:00+05:30 IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.
విజయవాడ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. తమిళనాడులోని టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కన్నా లక్ష్మీనారాయణ సందేహాలు వ్యక్తం చేశారు. 2016 నాటి టీటీడీ తీర్మానం పక్కనపెట్టి 2020 ఫిబ్రవరిలో తీసుకున్న తీర్మానాలు.ఏప్రిల్లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ని విస్మరించడంపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొసీడింగ్స్ని రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని, టీటీడీ ఆస్తుల్ని విక్రయించబోమని ప్రకటించే వరకు పోరాడుతామని కన్నా స్పష్టం చేశారు.