బీజేపీ కార్యకర్తలకు కాషాయ టోపీ వచ్చేసింది...

ABN , First Publish Date - 2022-04-05T20:02:32+05:30 IST

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక నుంచి కాషాయ టోపీలు ధరించి..

బీజేపీ కార్యకర్తలకు కాషాయ టోపీ వచ్చేసింది...

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక నుంచి కాషాయ టోపీలు ధరించి కనిపించోతున్నారు. కాషాయ టోపీలను కార్యకర్తలందరకికీ చేరవేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారంనాడు న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా కాషాయ టోపీలు ధరించి కనిపించారు. ఈనెల 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఒకరోజు ముందే ఈ క్యాప్‌లను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో ఈ టోపీలు బీజేపీ కార్యకర్తల ఐటెంటిటీగా మారే అవకాశాలున్నాయి.


ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందు అహ్మాదాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో ఈ కాషాయ టోపీ ధరించారు. తుది డిజైన్ ఖరారు చేసే మందు పలు డిజైన్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. సొగసుగా, ఫ్యాషన్‌గా గనిపించే తీరులో ఈ టోపీలను రూపొందించారు. క్యాప్‌ పైన పలచని ఎంబ్రాయిడరీ, ప్లాస్టిక్ లోటస్ (బీజేపీ ఎన్నికల గుర్తు) ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి హాజరైనప్పుడు ప్రధాని మోదీ ధరించిన టోపీ స్ఫూర్తితో కాషాయ టోపీను డిజైన్ చేసినట్టు చెబుతున్నారు.

Updated Date - 2022-04-05T20:02:32+05:30 IST