కేసీఆర్కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు:Tarun chug
ABN , First Publish Date - 2022-07-10T23:46:32+05:30 IST
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని బిజెపిరాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్(tarun chug) అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని బిజెపిరాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్(tarun chug) అన్నారు. ఈనెల21 నుంచి పల్లె ఘోస- బీజేపీ భరోసా పేరుతో యాత్ర పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన వివరించారు.వచ్చేఎన్నికల వరకు ప్రజల్లో ఉండాలని బిజెపి(bjp) నిర్ణయించిందని తరుణ్చుగ్ పేర్కొన్నారు.ఆగస్టు 2 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర కార్యక్రమం కూడా ఉంటుందన్నారు.మూడో విడతలో బండి సంజయ్ 20 రోజుల పాదయాత్ర చేస్తారని తరుణ్చుగ్ తెలిపారు.