బీజేపీ ఒక జూటా పార్టీ: హరీష్రావు
ABN , First Publish Date - 2022-04-17T21:21:42+05:30 IST
బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని యాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణలోని సంక్షేమ పథకాలు
హైదరాబాద్: బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని యాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణలోని సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ ఒక జూటా పార్టీ అని మండిపడ్డారు. బీజేపీ పాదయాత్ర ఎవరి కోసమో చెప్పాలి? అని ప్రశ్నించారు. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయని నిలదీశారు. కేంద్రం పేదల ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు. దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంక్గానే చూసిందన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే కరెంట్ కోతలు విధిస్తున్నారని హరీష్రావు దుయ్యబట్టారు.