Munugode : కార్యక్షేత్రంలోకి కమలం పార్టీ

ABN , First Publish Date - 2022-10-07T16:26:43+05:30 IST

బీజేపీ నాతయకులు మునుగోడుకు మకాం మార్చారు. నేటి నుంచి మునుగోడులో కమలం పార్టీ ప్రచారాన్ని ఉధృతం

Munugode : కార్యక్షేత్రంలోకి కమలం పార్టీ

Munugode : బీజేపీ నాయకులు (BJP Leaders) మునుగోడు (Munugode)కు మకాం మార్చారు. నేటి నుంచి మునుగోడులో కమలం పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఆర్ఎస్ఎస్ (RSS) సైతం మునుగోడును సీరియస్‌గా తీసుకుంటున్నాయి. బైపోల్స్‌ (bypolls)లో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. బీజేపీ నేతలకు బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan Reddy) సహా.. ముఖ్యనేతలకు బైపోల్స్‌పై ఆర్ఎస్ఎస్ (RSS) దిశానిర్దేశం చేసింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ నేతలు నేడు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బైక్ ర్యాలీలో స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండలాల ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనేతలు పాల్గొననున్నారు. 10న మునుగోడు బూత్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ సమావేశం నిర్వహించనున్నారు. నేడో రేడో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి (Komatireddy Rajagopal Reddy)ని మునుగోడు అభ్యర్థిగా అధికారికంగా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించనుంది. మంచి రోజు‌ చూసుకుని రాజగోపాలరెడ్డి నామినేషన్ వేస్తారని బీజేపీ చెబుతోంది. 

Updated Date - 2022-10-07T16:26:43+05:30 IST