మున్సిపాలిటీలో బీజేపీ అరంగ్రేటం
ABN , First Publish Date - 2021-03-04T05:16:59+05:30 IST
నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తొలిసారిగా బుధవారం 16వ వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిగా జంభుగోళం మౌనిక ఏకగ్రీవం అయ్యారు.
నాయుడుపేట, మార్చి 3 : నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తొలిసారిగా బుధవారం 16వ వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిగా జంభుగోళం మౌనిక ఏకగ్రీవం అయ్యారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాం నెలకొంది. ఆ మేరకు ఎన్నికల అధికారి నుంచి మౌనిక డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. ఆమె వెంట తిరుపతి పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్రెడ్డి, జిల్లా కార్యదర్శి జంపాల మాల్యాద్రి నాయుడు, రాజశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు.