బెంగాల్లో చివరి నిమిషంలో ఫలితాలు మారొచ్చు: బీజేపీ నేత దిలీప్ ఘోష్
ABN , First Publish Date - 2021-05-02T21:54:19+05:30 IST
పశ్చిమ బెంగాల్ పీఠాన్ని అధిష్ఠించేందుకు ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరోమారు సిద్ధమవుతున్న వేళ బీజేపీ నేత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ పీఠాన్ని అధిష్ఠించేందుకు ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరోమారు సిద్ధమవుతున్న వేళ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు ఇంకా ముగిసిపోలేదని, చివరి నిమిషంలోనూ ఫలితాలు మారొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి బీజేపీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చాలాచోట్ల తాము లీడింగ్లో ఉన్నామని, లెక్కింపు కొనసాగుతోందని పేర్కొన్నారు. కొన్ని స్థానాల్లో తాము స్వల్ప ఓట్ల తేడాతో వెనకబడ్డామని, మున్ముందు రౌండ్లలో పుంజుకుంటామని అన్నారు. కాబట్టి ఆందోళన అవసరం లేదని, చివరి నిమిషం వరకు వేచి చూడాలని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.