రైతు చట్టాలపై ఎవర్నీ ఖాతరు చేయని బీజేపీ: సిబల్

ABN , First Publish Date - 2020-12-05T23:31:04+05:30 IST

రైతు చట్టాలపై విపక్ష పార్టీల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి ..

రైతు చట్టాలపై ఎవర్నీ ఖాతరు చేయని బీజేపీ: సిబల్

న్యూఢిల్లీ: రైతు చట్టాలపై విపక్ష పార్టీల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఆ చట్టాలపై సమగ్ర చర్చలు జరపలేదని తప్పుపట్టారు. చాలా చట్టాలను పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు పంపడం లేదని, లోక్‌సభలో మెజారిటీ ఉన్నందునే వారు ఎవర్నీ లెక్కచేయడం లేదని అన్నారు. అనేక ఆర్డినెన్స్‌లు కూడా ఇదే తరహాలో తెస్తున్నారని పేర్కొన్నారు.


'అసలు విషయం ఏమిటంటే...వాళ్లు ఎప్పుడూ ప్రతిపక్షాలతో మాట్లాడలేదు. వారి ఆందోళనలను ఏమాత్రం ఖాతర చేయడం లేదు. సమగ్ర చర్చలు జరపకుండానే నిర్ణయాలు తీసుకోవడమే వారి తరహా పాలనా ప్రక్రియ. ఏదైనా ఒక ఆర్డినెన్స్ తెస్తే, ఏ కమిటీకి రిఫర్ చేయరు. తమకున్న మెజారిటీ బలంతో ఆమోదించుకుంటారు. ఎవరినీ లెక్క చేయరు' అని మీడియాతో మాట్లాడుతూ కపిల్ సిబల్ చెప్పారు. రైతుల జీవితాలపై పెనుప్రభావం చూపే అంశమైనందున వ్యవసాయ బిల్లులను పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి  పంపించాల్సి ఉంటుందని అన్నారు.

Updated Date - 2020-12-05T23:31:04+05:30 IST