BJP dharna: హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా

ABN , First Publish Date - 2022-05-10T18:09:24+05:30 IST

గ్రూప్ 1 పరీక్షను ఉర్దూలో నిర్వహిచవద్దని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం నిరసనలకు దిగింది.

BJP dharna: హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా

హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షను ఉర్దూలో నిర్వహిచవద్దని డిమాండ్ చేస్తూ నేడు(మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం(BJYM) నిరసనలకు దిగింది. అందులో భాగంగా నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. గ్రూప్ వన్ పరీక్షను ఉర్దూలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ  బీజేపీ నిరసన చేపట్టింది. ఒక వర్గానికి న్యాయం చేసేందుకే ఉర్దూలో గ్రూప్ వన్  పరీక్ష నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉర్దూ భాష ద్వారా ఎంపికైన వారిని తమ ప్రభుత్వం వచ్చాక తొలగిస్తామని ఇప్పటికే బండి సంజయ్(Bandi Sanjay) ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జీవో నెంబర్ 55ను రద్దు చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది. 

Read more