AP: గవర్నర్ బిశ్వభూషన్‌తో బీజేపీ బృందం భేటీ

ABN , First Publish Date - 2022-05-11T17:02:33+05:30 IST

గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో బీజేపీ బృందం బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది.

AP: గవర్నర్ బిశ్వభూషన్‌తో బీజేపీ బృందం భేటీ

విజయవాడ: గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో బీజేపీ బృందం బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై గవర్న‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో హిందు దేవాలయాలు, సంస్కృతిపై జరుగుతున్న దాడులను గవర్నర్‌కు వివరించారు. హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ బృందం కలిసింది. 

Read more