విజయసాయి ట్వీట్‌కు బీజేపీ కౌంటర్

ABN , First Publish Date - 2020-07-09T20:02:12+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సనీల్ దేవదర్ కౌంటరిచ్చారు.

విజయసాయి ట్వీట్‌కు బీజేపీ కౌంటర్

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సనీల్ దేవదర్ కౌంటరిచ్చారు. కేవలం పసును రంగునే కాదు.. అన్ని రంగులను కాషాయం చేయగల బలం బీజేపీకి ఉందన్నారు. ప్రస్తుతం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఫేడ్ చేస్తున్న మీ రంగును మీరే కాపాడుకోండంటూ విజయసాయికి దేవదర్ ఎద్దేవా చేశారు.


మరోవైపు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా విజయసాయికి ఘాటుగా కౌంటరిచ్చారు. బీజేపీ విషయాలు పట్టించుకోవడం మాని ముందు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మీగురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలంటూ కౌంటరిచ్చారు. ఇతర పార్టీల నాయకులు, వైసీపీలో చేరితో ఆరుద్రలు, బీజేపీలో చేరితే మిడతాలా? అంటూ ప్రశ్నించారు. గురువింద తన నలుపు ఎరుగదట.. అంటూ ఎద్దేవా చేశారు. అయినా తినటం గురించి నీ కన్నాబాగా ఎవరికి తెలుసంటూ సత్యకుమార్ ఘాటుగా కౌంటరిచ్చారు.

Updated Date - 2020-07-09T20:02:12+05:30 IST