BJP కి షాక్.. టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్
ABN , First Publish Date - 2021-12-28T14:48:45+05:30 IST
BJP కి షాక్.. టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్
హైదరాబాద్ సిటీ/సరూర్నగర్ : మీర్పేట్ కార్పొరేషన్లోని 13వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఎం.నరేంద్రకుమార్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎ్సలో చేరారు. మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో మీర్పేట్ కార్పొరేషన్లో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వారి కుటిల ప్రయత్నాలకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గాదీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ మీర్పేట్ శాఖ అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, బడంగ్పేట్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్రెడ్డి, నాయకులు కోవూరి రాకేశ్, మాదరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.