నేడు బీజేపీ సమన్వయ కమిటీ భేటీ
ABN , First Publish Date - 2022-01-19T13:57:18+05:30 IST
నేడు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది.
హైదరాబాద్: నేడు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది. మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణలో పార్టీకి సంబంధించిన పలు కీలక విషయాలపై అగ్రనేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి బండి సంజయ్, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారు. అలాగే వివిధ మోర్చాల పదాధికారులతో రేపు ఆన్లైన్లో అగ్రనేతలు సూచనలు, సలహాలు అందించనున్నారు.