నేడు బీజేపీ సమన్వయ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2022-01-19T13:57:18+05:30 IST

నేడు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది.

నేడు బీజేపీ సమన్వయ కమిటీ భేటీ

హైదరాబాద్‌: నేడు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది.  మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణలో పార్టీకి  సంబంధించిన పలు కీలక విషయాలపై అగ్రనేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి  బండి సంజయ్‌, ముఖ్య నేతలు  హాజరుకానున్నారు. రాష్ట్రంలో 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారు. అలాగే వివిధ మోర్చాల పదాధికారులతో రేపు ఆన్‌లైన్‌లో అగ్రనేతలు సూచనలు, సలహాలు అందించనున్నారు.

Updated Date - 2022-01-19T13:57:18+05:30 IST