రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసిన BJP, Congress
ABN , First Publish Date - 2021-12-16T14:23:51+05:30 IST
రాజ్యసభ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాలు విప్ జారీ చేశాయి.
న్యూడిల్లీ: రాజ్యసభ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాలు విప్ జారీ చేశాయి. పలు కీలక బిల్లులు సభ ముందుకు రానుండటంతో సభ్యులు తప్పక హాజరు కావాలని బీజేపీ త్రీ లైన్ విప్ జారీ చేసింది. మరోవైపు లిఖింపూర్ ఖేరీ వ్యవహారం, 12 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆందోళన ఉదృతం చేసే యోచనలో కాంగ్రెస్ సహా విపక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది.