కెమెరాలు పెట్టాలంటూ బీజేపీ అభ్యర్థి నిరసన

ABN , First Publish Date - 2020-12-01T20:20:59+05:30 IST

హైదరాబాద్: బీఎన్‌రెడ్డి నగర్‌లో బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు.

కెమెరాలు పెట్టాలంటూ బీజేపీ అభ్యర్థి నిరసన

హైదరాబాద్: బీఎన్‌రెడ్డి నగర్‌లో బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు. వెబ్ కెమెరా ఏర్పాటు చేయాలని అభ్యర్థి లచ్చిరెడ్డి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. మరోవైపు ముషీరాబాద్ అడిక్‌మెట్ డివిజన్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. స్థానికేతరులు ఉన్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలతో కాంగ్రెస్, బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Updated Date - 2020-12-01T20:20:59+05:30 IST