‘నేరచరిత్ర ఉన్నోళ్లు TTD బోర్డులో ఎందుకు..?’

ABN , First Publish Date - 2021-10-15T13:37:29+05:30 IST

టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న కొందరిని ఎందుకు నియమించారో ...

‘నేరచరిత్ర ఉన్నోళ్లు TTD బోర్డులో ఎందుకు..?’

తిరుమల : టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న కొందరిని ఎందుకు నియమించారో సీఎం జగన్‌ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని బీజేపీ నేత భాను ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఈ అంశంలో న్యాయస్థానం మందలించకముందే వారిని బోర్డు నుంచి తప్పించాలన్నారు. అలిపిరిలో టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి నిర్మించిన గోమందిరంలో భక్తులందరూ గోపూజ, గోతులాభారం వేసుకునేలా టీటీడీ మరింత చొరవ చూపాలన్నారు.

Updated Date - 2021-10-15T13:37:29+05:30 IST