బండి సంజయ్ దీక్ష భగ్నం .. అరెస్ట్
ABN , First Publish Date - 2022-01-03T03:56:44+05:30 IST
కరీంనగర్: జీవో 317 సవరించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
కరీంనగర్: జీవో 317 సవరించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన్ను తరలించారు. అంతకు ముందు తమ దీక్షను అడ్డుకుని తన క్యాంప్ ఆఫీస్కు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, దీక్ష చేస్తుంటే అడ్డుకోవడం దారుణమని ఆయన విమర్శించారు. కరోనా నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని, రూల్స్ అధికార పక్షానికి ఉండవా అని బండి ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
పోలీసులు బండి సంజయ్ దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయాన్ని చుట్టుముట్టి కార్యాలయం గేటును పగలకొట్టారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు.