‘నిర్వీర్యంగా చక్కెర కర్మాగారాలు’

ABN , First Publish Date - 2022-01-29T05:38:31+05:30 IST

తుని, జనవరి 28: ప్రభుత్వాల అవగాహన లోపం, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలు నష్టాలు చవిచూస్తూ నిర్వీర్యంగా మారుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, బీ

‘నిర్వీర్యంగా చక్కెర కర్మాగారాలు’
తాండవ షుగర్స్‌ గేటు వద్ద మాట్లాడుతున్న సోము వీర్రాజు

తుని, జనవరి 28: ప్రభుత్వాల అవగాహన లోపం, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలు నష్టాలు చవిచూస్తూ నిర్వీర్యంగా మారుతున్నాయని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ ఆధ్వర్యంలో తాండవ చక్కెర కర్మాగారాన్ని సోము సందర్శించారు. ఫ్యాక్టరీ కార్మికులు, రైతుల నుంచి వివరా లు సేకరించారు. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజరపు సూరిబాబు, కువల కుమార్‌, వేముల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:38:31+05:30 IST