బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు భారీగా చేరుకుంటున్న BJP శ్రేణులు

ABN , First Publish Date - 2022-05-26T18:09:50+05:30 IST

నగరానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాక సందర్భంగా బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది.

బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు భారీగా చేరుకుంటున్న BJP శ్రేణులు

హైదరాబాద్: నగరానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాక సందర్భంగా బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు బోనాలతో విమానాశ్రయానికి చేరుకున్నారు. పులి వేషాలు, డప్పు సప్పులతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. 



మరోవైపు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ సడన్‌గా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రావాల్సిన మోదీ నలభై నిమిషాలు ముందే అంటే 12.50 గంటలకే హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే మోదీ 15 నిమిషాల పాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బేగంపేట‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు చే‌స్తున్నారు. మోదీ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2022-05-26T18:09:50+05:30 IST