దెబ్బతిన్న రోడ్ల వద్ద బీజేపీ నేతల నిరసన
ABN , First Publish Date - 2020-12-06T04:56:26+05:30 IST
రాజంపేట మండలంలో దెబ్బతిన్న రోడ్ల వద్ద బీజేపీ నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు.
రాజంపేట, డిసెంబరు5 : రాజంపేట మండలంలో దెబ్బతిన్న రోడ్ల వద్ద బీజేపీ నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. తాళ్లపాక, రాజంపేట తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పోతుగుంట రమే్షనాయుడు, ఆ పార్టీ నాయకుడు విజయేంద్రబాబు తదితరులు మాట్లాడుతూ వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లను ఇంత వరకు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్లలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని పేర్కొన్నారు. రాజంపేట మండలంలోని తాళ్లపాక, హత్యరాల ప్రధాన రోడ్డు నివర్ తుఫానుతో దెబ్బతిందని దీనిని ఇంత వరకు పునరుద్ధరించలేదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టుపోగుల ఆదినారాయణ, వై.సురే్షరాజు, ప్రభావతి, రాము, వెంకటసుబ్బయ్యనాయుడు, సుభద్ర, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.