ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి: బీజేపీ
ABN , First Publish Date - 2020-10-27T11:02:59+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థి రఘునందన్రావును గెలిపించి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ పిలుపునిచ్చారు
భగీరథకాలనీ, అక్టోబరు 26: దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థి రఘునందన్రావును గెలిపించి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన నార్సింగ్, రాయపోల్, చేగుంటలో బూత్లెవెల్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రతి కార్యకర్తా ప్రతి ఓటరును కలిసి, కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న పథకాలను వివరించాలని సూచించారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. సమావేశాల్లో జిల్లా నాయకులు దర్పల్లి హరికృష్ణ, బాలరాజు పాల్గొన్నారు.