కరోనాపై హెల్త్ బులెటిన్ ఏమైంది?: బీజేపీ
ABN , First Publish Date - 2020-03-29T11:17:11+05:30 IST
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్రావు విస్మయం వ్యక్తం
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్రావు విస్మయం వ్యక్తం చేశారు. మొదట్లో ప్రతీరోజూ ఎందరికి వ్యాధి సోకింది? వంటి వివరాలతో బులెటిన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రోజువారీ హెల్త్ బులెటిన్ ఇవ్వాలనిప్రభుత్వాన్ని ఆయన కోరారు.