కావలి ఎమ్మెల్యేకు చేదు అనుభవం

ABN , First Publish Date - 2022-03-17T01:10:29+05:30 IST

జిల్లాలోని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డికి

కావలి ఎమ్మెల్యేకు చేదు అనుభవం

నెల్లూరు: జిల్లాలోని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీఎం సూచనలతో కావలిలోని 18వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు. మహిళలు ఖాళీ బిందెలతో ఎమ్మెల్యేను అడ్డుకుని నిరసన తెలిపారు. రెండు నెలల నుంచి నీటి సరఫరా సక్రమంగా లేదంటూ ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. సీఎం సూచిస్తేనే మీరు వార్డులోకి వచ్చారు.. లేకుంటే అంత సీను లేదని మహిళలు అన్నారు. వైసీపీ వార్డ్ ఇన్‌చార్జ్ అబ్దుల్లా అవసరం లేదంటూ మహిళలు నినాదాలు చేశారు. మహిళల నిలదీతతో ఎమ్మెల్యే రామిరెడ్డి ఉక్కిరి బిక్కిరయ్యారు. మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి పనితీరుపైనా మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-17T01:10:29+05:30 IST