నవీన్ పట్నాయక్కు ఏపీ గవర్నర్ శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2020-10-16T16:55:57+05:30 IST
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్నాథుడు ఆయనకు చక్కని ఆరోగ్యాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ట్విట్టర్ వేదికగా కోరారు.
ఇదిలా ఉంటే, కరోనా వైరస్ కారణంగా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నవీన్ నిర్ణయించుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.