బర్త్డే ప్లాంట్
ABN , First Publish Date - 2021-05-06T05:58:25+05:30 IST
బర్త్డే ప్లాంట్
- పుట్టిన రోజున మొక్కలు నాటిన మంత్రి సబిత
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని స్వగృహంలో మొక్కలు నాటారు. మనవడు, మనుమ రాలితో కలిసి మొక్కలు నాటిన అనంతరం మొక్కల పెంపకంతో భవిష్యత్ తరాలకు కలిగే ఉపయోగాల గురించి వారికి వివరించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ గ్రీన్ ఇండియా చాలెంజ్ అనే గొప్ప కార్యక్రమం చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించారని అన్నారు.