పుట్టిన రోజు నాడే... నిండిన నూరేళ్లు!
ABN , First Publish Date - 2022-05-22T06:12:56+05:30 IST
ఓర్వకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న విశ్వప్రసాద్ (46) గుండె పోటుతో కర్నూలులోని ఓ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి శనివారం తెలిపారు.
ఓర్వకల్లు, మే 21: ఓర్వకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న విశ్వప్రసాద్ (46) గుండె పోటుతో కర్నూలులోని ఓ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి శనివారం తెలిపారు. విశ్వప్రసాద్ కర్నూలు నగరంలో నివాసముంటున్నారు. శనివారం విశ్వప్రసాద్ పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్కు వెళ్లి వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లవారుజామున ఛాతిలో నొప్పి ఉందని భార్యకు చెప్పడంతో ఇద్దరూ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. కొద్ది సేపటికే ఛాతిలో నొప్పి ఎక్కువై విశ్వప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.