కృష్ణుడి జన్మరహస్యం!

ABN , First Publish Date - 2020-07-09T05:30:00+05:30 IST

శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించాడు. దేవకి సోదరుడు కంసుడు. అత్యంత క్రూరుడు. దేవకీ వసుదేవుల వివాహ సమయంలో ‘వారికి పుట్టిన సంతానం నీ పాలిట మృత్యువు అవుతుంద’ని ఆకాశవాణి కంసుడిని హెచ్చరిస్తుంది...

కృష్ణుడి జన్మరహస్యం!

శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించాడు. దేవకి సోదరుడు కంసుడు. అత్యంత క్రూరుడు. దేవకీ వసుదేవుల వివాహ సమయంలో ‘వారికి పుట్టిన సంతానం నీ పాలిట మృత్యువు అవుతుంద’ని ఆకాశవాణి కంసుడిని హెచ్చరిస్తుంది. దాంతో వారికి పుట్టిన సంతానాన్ని పురిట్లోనే చంపించి వేస్తుంటాడు కంసుడు. ఎనిమిదో సంతానంగా కృష్ణుడు జన్మిస్తాడు. ఆ బాలుడిని కాపాడి తీరాలని వసుదేవుడు నిర్ణయించుకుంటాడు.


కృష్ణుడిని రహస్యంగా యమునా నది దాటించి, గోకులానికి తీసుకువెళతాడు. అక్కడ యశోదకు కృష్ణుడిని అప్పగించి, యశోద కూతురిని తీసుకుని తిరిగి కారాగారం చేరుకుంటాడు. శిశువు జన్మించిన విషయం తెలుసుకున్న కంసుడు చంపడానికి వస్తాడు. కంసుడు ఆ బిడ్డను చంపే సమయంలో ఆదిపరాశక్తిగా మారి ‘నీ చావు తథ్యం. నిన్ను చంపేవాడు పుట్టాడు. ఇక నిన్నెవరూ రక్షించలేరు’ అని చెబుతుంది. ఆ విధంగా కృష్ణుడు గోకులంలో పెరిగి పెద్దవాడవుతాడు. కృష్ణుడు జన్మించిన రోజును  ‘శ్రీకృష్ణజన్మాష్టమి’గా జరుపుకొంటాం.

Updated Date - 2020-07-09T05:30:00+05:30 IST