ఆసిఫాబాద్‌ జిల్లా అడవుల్లో బర్డ్‌వాక్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-09T00:39:22+05:30 IST

అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అడవుల్లో రెండో విడత బర్డ్‌ వాక్‌ కార్యక్రమం ప్రారంభమైంది.

ఆసిఫాబాద్‌ జిల్లా అడవుల్లో బర్డ్‌వాక్‌ ప్రారంభం

ఆసిఫాబాద్‌: అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అడవుల్లో రెండో విడత బర్డ్‌ వాక్‌ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న అరుదైన పక్షి జాతులను గుర్తించడమే లక్ష్యంగా 2019లో మొదటిసారి బర్డ్‌వాక్‌ కార్యక్రమాన్ని కడంబా అటవీ ప్రాంతంలో ప్రారంభించారు. గతేడాది కొవిడ్‌ తీవ్రత కారణంగా కార్యక్రమం నిర్వహించ లేదు. ఈసారి కూడా నిర్వహించాలా వద్దా..? అనే శశబిషల నడుమ ఎట్టకేలకు 8,9తేదీల్లో నిర్వహించాలని తలపెట్టారు. ఇందులో భాగంగా శనివారం జిల్లాలోని కాగజ్‌నగర్‌, సిర్పూరు, పెంచికల్‌పేట, బెజ్జూరు, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో జిల్లా అటవీ అధికారి శాంతారాం నేతృత్వంలో బర్డ్‌వాక్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యావరణ ప్రేమికులు వందమందికిపైగా పేర్లు నమోదు చేసుకోగా 76మంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-09T00:39:22+05:30 IST