మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ భయం...25వేల కోళ్లను చంపాలని ఆదేశం

ABN , First Publish Date - 2022-02-18T15:36:25+05:30 IST

మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. థానే జిల్లాలోని షాహాపూర్ తహసీల్ పరిధిలోని వెహ్లోలి గ్రామంలో...

మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ భయం...25వేల కోళ్లను చంపాలని ఆదేశం

థానే : మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. థానే జిల్లాలోని షాహాపూర్ తహసీల్ పరిధిలోని వెహ్లోలి గ్రామంలోని కోళ్లఫారంలో 100 కోళ్లు అకస్మికంగా మరణించాయి.బర్డ్ ఫ్లూతో కోళ్లు మరణించాయనే భయంతో వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని థానే జిల్లా కలెక్టర్ రాజేష్ జె నర్వేకర్ జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులను ఆదేశించారు. మరణించిన కోళ్ల నమూనాలను పరీక్ష కోసం పూణే ప్రయోగశాలకు పంపించారు.బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నియంత్రించడానికి 25వేల కోళ్లను చంపాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.థానే జిల్లాలో ఏవియన్ఇన్ఫ్లుఎంజా కారణంగా పక్షులు చనిపోయినట్లు పరీక్షల ఫలితాలు నిర్ధారించాచయని థానే జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ భౌసాహెబ్ దంగ్డే చెప్పారు.థానే జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులను గుర్తించడం గురించి కేంద్ర మత్స్య,పశుసంవర్ధక మంత్రిత్వ శాఖకు సమాచారం అందించామని డాంగ్డే తెలిపారు.


Updated Date - 2022-02-18T15:36:25+05:30 IST