చైనా, పాక్తోనే ముప్పు: బిపిన్ రావత్
ABN , First Publish Date - 2021-03-05T07:45:07+05:30 IST
చైనా-పాకిస్తాన్ల నుంచి ఉత్పన్నమయ్యే సైనిక బెదిరింపులు, ముప్పులను ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని సైన్యాధిపతి (చీఫ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ‘భారత సైన్యం ఎదుర్కొంటున్న
అల్వాల్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): చైనా-పాకిస్తాన్ల నుంచి ఉత్పన్నమయ్యే సైనిక బెదిరింపులు, ముప్పులను ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని సైన్యాధిపతి (చీఫ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ‘భారత సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు-అత్యవసర చర్యలు’ అనే అంశంపై గురువారం సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ ఢిఫెన్స్ మేనేజ్మెంట్ (సీడీఎం)లో ఏర్పాటు చేసిన వెబినార్లో ఆయన మాట్లాడారు. యుద్ధ స్వభావం మారిన నేపథ్యంలో ఇతర దేశాలు అలవర్చుకున్న మార్పులు, విధానాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత సైన్యం ఎదుర్కొంటోందన్నారు.