‘విద్యార్థులపై బైండోవర్‌ కేసులు తగదు’

ABN , First Publish Date - 2021-03-04T05:23:37+05:30 IST

విద్యార్థులపై బైండో వర్‌ కేసులు పెట్టి ఇబ్బందులు పెడ తారా అని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష బుధవారం ముని సిపల్‌ కార్యాలయంలో కాశీబుగ్గ సీఐ శంకర రావును ప్రశ్నించారు.

‘విద్యార్థులపై బైండోవర్‌ కేసులు తగదు’
సీఐతో మాట్లాడుతున్న శిరీష

పలాస: విద్యార్థులపై బైండో వర్‌ కేసులు పెట్టి ఇబ్బందులు పెడ తారా అని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష బుధవారం ముని సిపల్‌ కార్యాలయంలో కాశీబుగ్గ సీఐ శంకర రావును ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన 21వ వార్డు అభ్యర్థి గోళ్ల చంద్ర రావు కుమారులు విశాఖపట్నం, హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదువు కుంటున్నారని తెలిపారు. వైసీపీ నాయకుల బెదిరింపులకు ఎదురొడ్డి కౌన్సిలర్‌ బరిలో ఉన్నారని, ఆయన పిల్లలపై కూడా కక్షసాధింపు చర్యలకు పాల్పడడంపై తప్పుపట్టారు. చదువుతున్న పిల్లలపై బైండోవర్‌ కేసులుపెట్టేందుకు వారిని రప్పించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-03-04T05:23:37+05:30 IST