తగ్గిన ‘కుబేరులు’...

ABN , First Publish Date - 2021-08-11T20:39:53+05:30 IST

భారత్‌లో కుబేరుల సంఖ్య 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21 లో స్వల్పంగా తగ్గింది.

తగ్గిన ‘కుబేరులు’...

న్యూఢిల్లీ : భారత్‌లో కుబేరుల సంఖ్య 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21 లో స్వల్పంగా తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 141 మంది బిలియనీర్లు ఉండగా, 20221 ఆర్ధిక సంవత్సరంలో ఈ సంఖ్య 136 కు తగ్గింది. అంటే అంతకుముందు ఏడాది కంటే ఐదుగురు తగ్గారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివరాలను వెల్లడించారు.


ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు సమయంలో రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని వెల్లడించిన వ్యక్తులను ఈ జాబితాలో చేరుస్తారన్న విషయం తెలిసిందే. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. ఇక... 2018-19 లో 77 మంది బిలియనీర్లు ఉండగా, గత సంవత్సరానికే ఈ సంఖ్య దాదాపు రెండింతలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదుగురు తగ్గినప్పటికీ, మూడేళ్ల క్రితంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. కాగా... 2016 నుండి... ‘సంపద పన్ను’ను రద్దు చేయడంతో ఈ కుబేరుల పూర్తి సంపద వివరాలు సీబీడీటీ వద్ద అందుబాటులో లేవు.

Updated Date - 2021-08-11T20:39:53+05:30 IST