మృత్యు బావిలో బైక్ రైడర్ల విన్యాసాలు.. ఉన్నట్టుండి పట్టుతప్పింది.. అంతే ఊహించని విధంగా...
ABN , First Publish Date - 2022-07-27T14:10:28+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో హడలెత్తించే ఉదంతం...
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో హడలెత్తించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడ ఓ జాతరలో మృత్యుబావి ప్రదర్శనలో ఇద్దరు బైకర్లు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసినవారి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అమ్రోహా జిల్లా ఉఝరి పట్టణంలో గత కొన్ని రోజులుగా ఉర్స్ జాతర జరుగుతోంది. ఈ జాతరలో 'మృత్యుబావి' ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.
ఈ మృత్యు బావిలో స్టంట్ చేస్తున్న సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దీనిని చూసినవారంతా షాక్కు గురయ్యారు. మృత్యు బావిలో ఇద్దరు బైక్ రైడర్లు విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఓ కారు కూడా విన్యాసాలు చేస్తోంది. ఇంతలో బైక్ నడిపేవారి బ్యాలెన్స్ తప్పింది. వారు బైక్తో సహా కిింద పడ్డాడు. ఈ ఆకస్మిక ప్రమాదంతో గందరగోళం నెలకొంది. తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బైక్ రైడర్స్ గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.