బ్యాంక్ వద్ద పార్క్ చేసిన బైక్ చోరీ
ABN , First Publish Date - 2022-05-18T05:44:46+05:30 IST
బ్యాంక్ వద్ద పార్క్ చేసిన బైక్ చోరీ
మొయినాబాద్, మే 17: బ్యాంక్ వద్ద పార్క్ చేసిన బైక్ చోరీకి గురెంది. చిలుకూరు గ్రామానికి చెందిన పూడూరు శ్రీనివాస్ సోమవారం తన బైక్(ఏపీ23జె3658)ను మండల కేంద్రంలోని యూనియన్బ్యాంకు వద్ద పార్క్ చేసి హైదరాబాద్ వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మొయినాబాద్ పోలీసులు తెలిపారు.