బైక్ రైడింగ్‌కు రండి.. మంత్రి కేటీఆర్‌కు రాజాసింగ్ సవాల్

ABN , First Publish Date - 2021-10-17T00:47:12+05:30 IST

అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం పడింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. వర్ష సూచనతో ....

బైక్ రైడింగ్‌కు రండి..   మంత్రి కేటీఆర్‌కు రాజాసింగ్ సవాల్

హైదరాబాద్: అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం పడింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. వర్ష సూచనతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ వనస్థలిపురంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎల్బీనగర్ మార్గంలో రోడ్డుపై వరద నీరు నిలిచింది. వాహనాల రాకపోకలు గంటల పాటు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాజాసింగ్ తనతో పాటు బైక్ రైడింగ్‌కు రావాలని కోరారు. వర్షం పడుతున్న వేల రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో లైవ్‌గా చూపిస్తానని అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అసెంబ్లీలో మాటలకే పరిమితమని వాస్తవం మాత్రం చాలా ఘోరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రమే ధనిక రాష్ట్రమని ప్రజలకు కాదని అన్నారు. 



Updated Date - 2021-10-17T00:47:12+05:30 IST