వీహెచ్పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ABN , First Publish Date - 2021-01-19T05:18:03+05:30 IST
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం వీహెచ్పీ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కోసం సోమవారం గోదావరిఖని కోదండ రామాలయం నుంచి పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీని నిర్వహించారు.
కళ్యాణ్నగర్, జనవరి 18: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం వీహెచ్పీ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కోసం సోమవారం గోదావరిఖని కోదండ రామాలయం నుంచి పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 500 ఏళ్లుగా అయోధ్యలో రాంమందిర నిర్మాణం కోసం దేశప్రజల ఆకాంక్ష అని, రామమందిర నిర్మాణం కోసం ప్రజలను భాగస్వామ్యులను చేసి ఇంటింటికి వెళ్లి రా మమందిర నిర్మాణం కోసం నిధులను సేకరించనున్నట్టు తెలిపారు. అయోధ్యలో క ట్టబోయే రామమందిరం నిర్మాణ శైలిపై ప్రజలకు వివరించనున్నట్టు వివేక్ పేర్కొన్నారు. దీని కోసం కుల మతాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో భా గస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన రామమందిర నిర్మాణ కరపత్రాలను, డోర్ స్టిక్లర్లను ఆవిష్కరించారు. కోదండ రామాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ రమేష్నగర్, కళ్యాణ్నగర్, చౌరస్తా వరకు కొనసాగిం ది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యదర్శి రాజన్న, వీ హెచ్పీ నాయకులు మాదవరపు వెంకట్రావ్, వేపూరి రాములు, కాస సత్యనారాయణ, అయోధ్య రవీందర్, మోడెం సురేందర్, అడిగొప్పుల రాజు, ముష్కె సంపత్, రాంచంద్రారెడ్డి, బల్మూరి అమరేందర్, కౌశిక హరి, బల్మూరి వనిత తదితరులు పాల్గొన్నారు.