బైక్ బోల్తాపడి వివాహిత మృతి
ABN , First Publish Date - 2021-12-09T06:16:48+05:30 IST
పట్టణంలోని సుంకరమెట్ట కూడలికి సమీపంలో బుధవారం ద్విచక్ర వాహనం బోల్తా పడడంతో ఓ వివాహిత మృతి ప్రాణాలు కోల్పోయారు. వాహనం నడుపుతున్న ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
భర్తకు తీవ్ర గాయాలు.. రోడ్డు దెబ్బతినడంతో ప్రమాదం
అనకాపల్లి టౌన్, డిసెంబరు 8: పట్టణంలోని సుంకరమెట్ట కూడలికి సమీపంలో బుధవారం ద్విచక్ర వాహనం బోల్తా పడడంతో ఓ వివాహిత మృతి ప్రాణాలు కోల్పోయారు. వాహనం నడుపుతున్న ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
బుచ్చెయ్యపేట మండలం వడ్డాది పల్లివారివీధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్పర్సన్ తెప్పల సంతోషి (40), ఆమె భర్త నాగేశ్వరరావు ద్విచక్ర వాహనంపై బుధవారం ఉదయం వడ్డాది నుంచి ఓ దినకార్యానికి బయలుదేరారు. అనకాపల్లి మీదుగా గాజువాక సమీపంలోని గంగవరం గ్రామంలోని బంధువుల ఇంటికి వీరు వెళ్తున్నారు. సుంకరమెట్ట జంక్షన్ దాటిన తరువాత రోడ్డు దెబ్బతినడంతో ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో ఇద్దరూ బోల్తాపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించగా సంతోషి చికిత్స పొందుతూ మృతి చెందింది. హెల్మెట్ ధరించుకున్న నాగేశ్వరరావుకు ప్రమాదం తప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ట్రాఫిక్ ఎస్ఐ రమేశ్ తెలిపారు.