మోటారుసైకిల్ నుంచి జారిపడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-13T06:19:55+05:30 IST
మండలంలో సోమవారం ఓ మోటారుసైకిల్ ప్రమాదవశాత్తూ జారడంతో వ్యక్తి మృతి చెందాడు. చింతూరు మండలంలోని చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొల్తూరుకు చెందిన కోటం రామారావు ద్విచక్ర వాహనంపై మోతుగూడెం వైపు నుంచి చింతూరు వైపు వస్తుండగా ప్రమాదవశాత్తూ మోతుగూడెం పోలీస్స్టేషన్ పరిధిలోని లక్కవరం జంక్షన్ సమీపంలో ఓ కల్వర్టు వద్ద రోడ్డు పక్కకు పడిపోయాడు.
చింతూరు/మోతుగూడెం, ఏప్రిల్ 12: మండలంలో సోమవారం ఓ మోటారుసైకిల్ ప్రమాదవశాత్తూ జారడంతో వ్యక్తి మృతి చెందాడు. చింతూరు మండలంలోని చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొల్తూరుకు చెందిన కోటం రామారావు ద్విచక్ర వాహనంపై మోతుగూడెం వైపు నుంచి చింతూరు వైపు వస్తుండగా ప్రమాదవశాత్తూ మోతుగూడెం పోలీస్స్టేషన్ పరిధిలోని లక్కవరం జంక్షన్ సమీపంలో ఓ కల్వర్టు వద్ద రోడ్డు పక్కకు పడిపోయాడు. ఈ ప్రమాదంలో రామారావు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిసింది. గూడూరులో ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మోతుగూడెం ఎస్ఐ సత్తిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.