Bihar Student: ఇదెక్కడి విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. కారణమేంటంటే..
ABN , First Publish Date - 2022-08-02T00:10:10+05:30 IST
విద్యార్థి జీవితంలో పరీక్షలనేవి కీలక ఘట్టాలు.. పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు..
విద్యార్థి జీవితంలో పరీక్షలనేవి కీలక ఘట్టాలు.. పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు.. ఎంత కష్టపడి చదివిన విద్యార్థి అయినా నూటికి నూరు మార్కులు మాత్రమే సాధించగలడు.. అయితే బీహార్కు చెందిన ఓ విద్యార్థి (Bihar Student marks) వందకు ఏకంగా 151 మార్కులు సాధించి అందరినీ నివ్వెరపరిచాడు.. మొదట తనకు వచ్చిన మార్కులు చూసి ఆ విద్యార్థి కూడా షాకయ్యాడు.. తర్వాత అసలు విషయం తెలుసుకున్నాడు.
ఇది కూడా చదవండి..
Letter to PM Modi: పెన్సిల్, ఎరేజర్, మ్యాగీ ధరలు పెరిగిపోయాయి.. ప్రధానికి ఓ చిన్నారి లేఖ!
బీహార్లోని దర్బంగా జిల్లాకు చెందిన లలిత్ నారాయణ అనే విద్యార్థి మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ (Political Science Exam)లో లలిత్కు 100కు ఏకంగా 151 మార్కులు వచ్చాయి. ఆ మార్కులు చూసి లలిత్ షాక్ అయ్యాడు. తర్వాత అసలు విషయం తెలుసుకుని ఖంగు తిన్నాడు. టైపింగ్ మిస్టేక్ వల్లే అలా జరిగినట్టు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. అవి ఇది తాత్కాలిక మార్కు షీట్లు కావడం వల్లే ముందుగా చెక్ చేయలేదని చెప్పారు. ఇక, అదే యూనివర్సిటీలో బీకామ్ చదువుతున్న మరో విద్యార్థికి సున్నా మార్కులు మాత్రమే వచ్చాయి. అది కూడా టైపింగ్ మిస్టేక్ అని యూనివర్సిటీ సమాధానం ఇచ్చింది.