ప్రైవేటు ఆసుపత్రులలోనూ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-03-01T17:48:28+05:30 IST

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని అందరికీ...

ప్రైవేటు ఆసుపత్రులలోనూ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నట్లు నాడు నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హమీని నిలబెట్టుకోనున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ ప్రకటించారు. రాష్టంలో ఈరోజు నుంచి ప్రైవేటు ఆసుపత్రులలోనూ కరోనా టీకా ప్రజలకు ఉచితంగా వేయనున్నారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. ముఖ్యమంత్రి నితీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా 60 ఏళ్ల పైబడినవారికి, 45 ఏళ్లు దాటి అనారోగ్యంతో బాధపడుతున్నవారికి టీకాలు వేయనున్నారు. కాగా ఈరోజు బీహార్ సీఎం నితీష్ కుమార్ పుట్టినరోజు. మరోవైపు ఆయన ఈరోజు కరోనా టీకా మొదటి డోసు తీసుకోనున్నారు.

Updated Date - 2021-03-01T17:48:28+05:30 IST