బిహార్‌లో ఎన్నికలను వాయిదా వేయండి : ఈసీతో రాజకీయ పక్షాలు

ABN , First Publish Date - 2020-08-02T15:07:40+05:30 IST

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని అన్ని రాజకీయ పక్షాలు కేంద్ర ఎన్నికల

బిహార్‌లో ఎన్నికలను వాయిదా వేయండి : ఈసీతో రాజకీయ పక్షాలు

పాట్నా : రాబోయే అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని అన్ని రాజకీయ పక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత బాగా ఉందని, అంతేకాకుండా వరదలతో కూడా రాష్ట్రం అతలాకుతలమైందని పార్టీలు పేర్కొన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాయి.


ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించడంపై తమ తమ అభిప్రాయాలు చెప్పాలంటూ ఈసీ అన్ని రాజకీయ పక్షాలకూ లేఖలు రాసింది. బీజేపీ, జేడీయూ మినహాయించి... మిగితా పక్షాలన్నీ కూడా ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపాయి. బీజేపీ మిత్రపక్షమైన ఎల్జేపీ కూడా వాయిదాకే మొగ్గు చూపింది. ఇక కాంగ్రెస్, ఆర్జేడీ అయితే ఎప్పటి నుంచో ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-08-02T15:07:40+05:30 IST