PM Modi హత్యకు ఇద్దరు ఉగ్రవాదుల కుట్ర...నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-14T16:59:38+05:30 IST

సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని...

PM Modi హత్యకు ఇద్దరు ఉగ్రవాదుల కుట్ర...నిందితుల అరెస్ట్

2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చే లక్ష్యం

పాట్నా(బీహార్): సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు గురువారం ఛేదించారు.2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, జులై 12వతేదీన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బీహార్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పాట్నా నగరంలో ఉగ్రవాదులైన అథర్ పర్వేజ్, ఎండీ జలాలుద్దీన్ లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 


ఉగ్రవాదుల సమావేశం...

జులై 6, 7 తేదీల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా సమావేశాలు జరిపారు. దీంతో అనుమానిత ఉగ్రవాదులున్న ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడిలో, పోలీసులు నేరారోపణ పత్రాలను కనుగొన్నారు. వాటిలో ఒకటి 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ దేశం చేయాలనేది.వారి నుంచి 25 పీఎఫ్‌ఐ కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంటెలిజెన్స్ బ్యూరోకు పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద మాడ్యూల్ పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసులు, కేంద్ర సంస్థల అధికారులు జులై 11 వతేదీన నయా తోలా ప్రాంతంలో దాడి చేసి అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.



ఇతర రాష్ట్రాల యువకులకు ఉగ్రవాద శిక్షణ

కేరళ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి యువకులు ఉగ్రవాద శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వచ్చేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి భారత దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2022-07-14T16:59:38+05:30 IST