బిహార్ సీఎం నితీశ్పైకి చెప్పు!
ABN , First Publish Date - 2020-10-27T06:56:49+05:30 IST
బిహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం ముజఫర్పూర్ జిల్లాలోని సక్రాలో ఎన్నికల ప్రచార
సక్రా/మహువా, అక్టోబరు 26: బిహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం ముజఫర్పూర్ జిల్లాలోని సక్రాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనగా ఆయనపైకి కొంతమంది నిరసనకారులు చెప్పును విసిరారు. అది ఆయన పక్కనుంచే వెళ్లి కింద పడింది.
ప్రసంగం ముగించి ఆయన హెలికాప్టర్ వద్దకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి ఆర్జేడీయే కారణమని నితీశ్ ఆరోపించారు. కాగా, చెప్పు విసిరిన ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.